వైఎస్సార్ కాపరి బంధు
-గొర్రెల కాపరులకు ఆర్థిక సాయం
-ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు,
ఒక పొట్టేలు చొప్పున
12,500 మంది లబ్ధిదారులకు ఏటా ప్రయోజనం.
-రూ.1.50 లక్షలు ఎన్సీడీసీ ఆర్థిక సాయం.
* అమరావతి:
గొర్రెల కాపరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తీసుకు వస్తోంది.
ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు,
ఒక పొట్టేలు
కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేయనుంది.
* ఎన్సీడీసీ (నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆర్థిక సాయంతో
‘వైఎస్సార్ కాపరి బంధు’ పథకాన్ని అమలు చేయనుంది.
* యూనిట్ల కొనుగోలుకు మంజూరు చేసే రుణంలో 30 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. గొర్రెల రేట్లు అధికంగా ఉండటంతో
ఒక యూనిట్ (20 గొర్రెలు, ఒక పొట్టేలు) కొనుగోలుకు రూ.1.50 లక్షలు మంజూరు చేయనుంది.
* సంవత్సరానికి 12,500 మంది చొప్పున నాలుగు సంవత్సరాలకు 50 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు.
* ఎన్సీడీసీ ఈ పథకానికి తొలుత రూ.200 కోట్లు కేటాయించేందుకు అంగీకరించిందని అధికారులు తెలిపారు.
* లబ్ధిదారులకు
30 శాతం సబ్సిడీ
– రాష్ట్రంలోని గొర్రెల కాపరులు, సొసైటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇటీవల కలిసి
తమ జీవన ప్రమాణాలు
మెరుగు పరిచేందుకు ఒక పథకాన్ని అమలు చేయాలని కోరారు.
– ఎన్సీడీసీ ఆర్థిక సాయంతో ప్రస్తుతం గొర్రెలకాపరులు రుణంపై గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు.
– ఈ పథకం అమలులో నిబంధనలు కఠినంగా ఉండటంతో గొర్రెల కాపరులు రుణాలు పొందలేక పోతున్నారు.
– ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో నిబంధనలు సరళీకృతం చేయడంతో పాటు, సబ్సిడీ పెంచే విధంగా పథకాన్ని రూపకల్పన చేయాలని ఆదేశించారు.
– ఎన్సీడీసీ ఇస్తున్న సబ్సిడీని 20 శాతం నుంచి 30 శాతానికి పెంచుతున్నారు.
– రుణం ఇచ్చేటప్పుడు గొర్రెల కాపరులు భూమిని తనఖా పెట్టే విధానం అమలులో ఉంటే.. అందులో కొన్ని మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు.
– ఈ మేరకు అధికారులు పథకాన్ని రూపకల్పన చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపారు.
దీనిపై త్వరలో జరనున్న సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
* నష్ట పరిహారం,
పశు వైద్యంతో అండగా..
– రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైఎస్సార్ పశు నష్ట పరిహారం, రాజన్న పశు వైద్యం వంటి పథకాలను అమలులోకి తీసుకువచ్చింది.
* వీటితోపాటు సబ్సిడీపై పశువుల దాణా,
పరికరాలను అందిస్తోంది.
– చనిపోయిన పశువులు, గొర్రెలు, మేకలకు ఎటువంటి ప్రీమియం చెల్లించక పోయినప్పటికీ నష్టపరిహారం చెల్లించే ఏర్పాటు చేసింది.
– ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయిన 9 వేల
ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు ప్రభుత్వం వాటి పోషకుల
బ్యాంకు ఖాతాల్లో
రూ.14 కోట్ల వరకు జమ చేసింది.
– తొలి విడతగా ప్రభుత్వం పశు నష్టపరిహారం పథకానికి
రూ.35 కోట్లు కేటాయించింది.
– ఫిబ్రవరిలో ప్రారంభమైన రైతు భరోసా కేంద్రాల ద్వారా రాజన్న
పశు వైద్యం
పథకాన్ని
అమలులోకి తీసుకువచ్చింది.
– గ్రామ సచివాలయాల్లో కొత్తగా నియమితులైన
పశు సంవర్థక శాఖ సహాయకులు పశువులకు వైద్యసాయాన్ని అందిస్తున్నారు.