రేవంత్రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి!
తెలంగాణ పోలీసులను ప్రశ్నంచిన హైకోర్టు
మీడియాఫైల్స్/ హైదరాబాద్ : రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయంలో తెలంగాణ పోలీసులకు హైకోర్టు అక్షింతలు వేసింది. అరెస్ట్ చేయవద్దని చెప్పడం లేదని, కనీసం నోటీసు ఇవ్వకుండా, వివరాలు తెలియజేయకుండా ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నంచింది. రేవంత్రెడ్డిని డ్రోన్ల కేసులో అరెస్ట్ చేసే ముందుకు చట్ట ప్రకారం ఆయనను ఏ నేరారోపణలపై, ఏసెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నారో తెలియజేశారో లేదో వివరించాలని తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పోలీస్స్టేషన్ వద్దకు రేవంత్ వచ్చి లొంగిపోతేనే పోలీసులు అరెస్ట్ చేశామని చెబుతున్నప్పుడు ఇలాంటి సమయంలో సీఆర్పీసీలోని 41ఎ కింద నోటీసు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. రేవంత్రెడ్డి బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తులపై పోలీసుల వైఖరిని తెలియజేయాలని ఆదేశించింది. ఈమేరకు శుక్రవారం న్యాయమూర్లి జస్టిస్ జి.శ్రీదేవి ఆర్డర్స్ జారీ చేశారు. రేవంత్పై పోలీసులు పెట్టిన డ్రోన్ల వినియోగ కేసును కొట్టేయాలని, బెయిల్ నిరాకరిస్తూ కింది కోర్టు ఆర్డర్ను కొట్టేయాలని, డ్రోన్ల కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ రేవంత్రెడ్డి దాఖలు చేసిన 3 వేరువేరు వ్యాజ్యాలపై పోలీసుల వాదనలతో కౌంటర్ వేయాలని ఆదేశించారు. తదుపరి విరణను ఈ నెల 17కి వాయిదా వేశారు.
రాజకీయ కక్షతో రేవంత్రెడ్డిపై డ్రోన్ల కేసు పెట్టారని ఆ కేసులో ఇతర నిందితులు ఆరుగురికీ బెయిల్ వచ్చిందని, రేవంత్రెడ్డికి కూడా హైకోర్టు మంజూరు చేయాలని ఆయన తరఫు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సల్మాన్ కుర్షీద్ కోరారు. పోసులు పెట్టిన కేసులోని సెక్షన్ 188 కింద ఆరోపణలు నిరూపణ అయితే జైలు శిక్ష పడేది ఒక్క నెల లేదా 2 వందల జరిమానా. లేదా ఆ రెండూ కలిపి కోర్టు శిక్ష విధింపునకు మాత్రమే అకాశం ఉందన్నారు. చర్లపల్లి జైలుకు రేవంత్ను తరలించి 9 రోజులు అయిందని, బెయిల్ ఇవ్వాలన్నారు.ఎంపీగా ఉన్న రేవంత్రెడ్డి పార్లమెంటుకు హాజరీ కావాల్సివుందని, బెయిల్ మంజూరు చేయాలని
పబ్లిక్ప్రాసిక్యూటర్ వాదనలు వినిస్తూ… 188 సెక్షన్తోపాటు ఇతర సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టినట్లు చెప్పారు. వీఐపీల ఇండ్లపై డ్రన్లను ఎగురేస్తే తర్వాత ఇదే మాదిరిగా తీవ్రవాదలు చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. ఇప్పటికిప్పుడు బెయిల్ జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు. కేసు ఫైల్ తెప్పించుకుని అధ్యయనం చేశాక కౌంటర్ వేస్తామని చెప్పారు. దీంతో హైకోర్టు విచారణ 17కి వాయిదా పడింది. అదే రోజున మూడు రిట్లపై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.